'ఇంకొక్కడు' (ఇరుమురుగన్) చిత్రంలో లవ్ పాత్రలో నటించడం ఓ సవాల్లా మారిందని చియాన్ విక్రమ్ చెప్పుకొచ్చాడు. విక్రమ్, నయనతార, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ఇంకొక్కడు' (ఇరుముగన్). వసూళ్లు బాగానే ఉండటంతో, ఆ చిత్రం బృందం సంబరాల్లో మునిగిపోయింది.
ఈ చిత్ర నిర్మాత శిబు తమీమ్ మాట్లాడుతూ తమ చిత్రం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1,400 థియేటర్లలో ఆడుతోందని చెప్పారు. తమిళనాడులో విజయవంతంగా రెండోవారం ప్రదర్శితమవుతోందన్నారు. చిత్రం కోసం తాము పడ్డ శ్రమకు తగ్గ ఫలితాన్ని ప్రేక్షకులు తమకు అందిస్తున్నారన్నారు.