గాయత్రి: విష్ణు, శ్రియ లుక్.. "ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం"

సోమవారం, 1 జనవరి 2018 (11:59 IST)
విలక్షణ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో 'గాయత్రి' సినిమా తెరకెక్కుతోంది. మదన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, విష్ణు, శ్రియలు కూడా నటిస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని.. ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 
 
విష్ణు-శ్రియలకి సంబంధించిన ఈ పోస్టర్‌లో శ్రియకి 'జడ' అల్లుతూ విష్ణు కనిపిస్తున్నాడు. "ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం" అనే వాక్యంతో వదిలిన ఈ పోస్టర్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా వుంది. 
 
నిఖిలా విమల్, అనసూయ ముఖ్యమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందించాడు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. కాగా తాజాగా విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు