సమంత ఇలా మారిపోయిందేమిటి?

మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (09:50 IST)
టాలీవుడ్ సమంత.. నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత వరుసగా సినిమాల్లో నటించేందుకు సిద్ధం అవుతోంది. ఏమాత్రం గ్యాప్ దొరికినా కూడా ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేస్తోంది.
 
సమంత ఒక క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. అయినా కూడా ఆమె ఒక హిందూ ధర్మ పాటించే వ్యక్తిగా మారిపోయింది. హిందూ వ్యక్తిగా పూజలు దేవుడిని మొక్కడం కాకుండా అంతకు మించి అన్నట్లుగా సమంత వ్యవహరిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
 
సాహసయాత్రలు చేసి హిందూ దేవాలను దర్శించుకోవడం మొదలుకుని ఎన్నో సేవా కార్యక్రమాలను సమంత చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె సికింద్రాబాద్‌‌లోని ఒక గురుకులంకు వెళ్లి అక్కడ గురువులతో, పిల్లలతో చాలా సమయం గడిపారు.
 
అదే సమయంలో సమంత అక్కడి నిర్వాహకులకు భారీ మొత్తంలో విరాళంను కూడా ఇచ్చింది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. అసలు విషయం ఏంటీ అనేది సమంత సన్నిహితుల నుండి క్లారిటీ రావడం లేదు కానీ గురుకులం నిర్వహణకు సమంత భారీ మొత్తంలో విరాళం ఇవ్వడం జరిగిందట.
 
ఇకపోతే.. సమంత నటించిన యశోద సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శాకుంతలం సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు