మంచి చేయాలనుకునే కల్యాణ్ గారికి విషెస్: రేణూ దేశాయ్ పోస్ట్

ఐవీఆర్

బుధవారం, 12 జూన్ 2024 (15:44 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి రేణూ దేశాయ్ శుభాకాంక్షలు తెలిపారు. తన పిల్లలు అకీరా, ఆద్యలిద్దరూ తన తండ్రి ప్రమాణోత్సవానికి వెళ్లారనీ, అక్కడి నుంచి వీడియో కాల్ చేసారంటూ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేస్తూ... వాళ్ల నాన్న బిగ్గెస్ట్ డేకి రెడీ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మంచి చేయాలనుకునే కల్యాణ్ గారికి శుభాకాంక్షలు" అని పోస్ట్ చేసారు.
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

నీ తమ్ముడు తుఫాన్...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే క్రమంలో బుధవారం ఉదయం చంద్రబాబు నాయుడు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసారు. ఈ వేడుకకు కేంద్రమంత్రులు, దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంకా ఎందరో సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రమాణ స్వీకారం వేడుక ముగిసాక ప్రధానమంత్రి నరేంద్ర మోడి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి నేరుగా మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లారు.
 
ఆయనను పలుకరిస్తూ... నీ తమ్ముడు తుఫాన్ అంటూ నవ్వుతూ ఇరువురు చేతులను పట్టుకుని పైకి లేపి ప్రజలకు అభివాదం చేసారు. ఈ అరుదైన ఘట్టాన్ని చూసిన మెగా ఫ్యాన్స్ సంతోషంతో హర్షధ్వానాలు చేసారు. కాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి మంత్రివర్గంలో కీలక పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు