ముమైత్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో చిత్రం

బుధవారం, 2 మే 2012 (21:51 IST)
మహారాష్ట్రలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ముమైత్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో విభిన్న కథా చిత్రం రూపొందనుంది. బి.ఎస్‌.ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.1గా కె.ఎస్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఆంటీ అంకుల్‌ నందగోపాల్‌' దర్శకుడు డి.వి.కె.నాగేశ్వరరావు తన ద్వితీయ చిత్రంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 

మే మూడో వారంలో ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత కె.ఎస్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''మహారాష్ట్రలో జరిగిన ఓ సంఘటనకు ఇన్‌స్పైర్‌ అయి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. ఈ చిత్రంలో ముమైత్‌ఖాన్‌ ప్రధాన పాత్రను పోషించనున్నారు. కథ మొత్తం ముమైత్‌ఖాన్‌ చుట్టూ తిరుగుతుంది. మే మూడోవారంలో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాము.

ప్రస్తుతం ప్రవీణ్‌ ఇమిడి సంగీత దర్శకత్వంలో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఓ యువజంట హీరోహీరోయిన్లుగా నటించబోతున్నారు. ఆ హీరోహీరోయిన్ల ఎంపిక జరుగుతోంది. సబ్జెక్ట్‌ డిమాండ్‌ మేరకు బడ్జెట్‌కి వెనకాడకుండా ఈ చిత్రాన్ని భారీగా నిర్మించడానికి ప్లాన్‌ చేశాం. బ్యాంకాక్‌, హైదరాబాద్‌, ముంబాయిలలో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతుంది'' అన్నారు.

ముమైత్‌ఖాన్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ళ భరణి, ఎం.ఎస్‌.నారాయణ, కృష్ణభగవాన్‌, భరత్‌, పృథ్వి, మాస్టర్‌ భువన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్‌, ఎడిటింగ్‌: నందమూరి హరి, ఫైట్స్‌: నందు, నిర్మాత: కె.ఎస్‌.ప్రసాద్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: డి.వి.కె.నాగేశ్వరరావు.

వెబ్దునియా పై చదవండి