మహారాష్ట్రలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ముమైత్ఖాన్ ప్రధాన పాత్రలో విభిన్న కథా చిత్రం రూపొందనుంది. బి.ఎస్.ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా కె.ఎస్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఆంటీ అంకుల్ నందగోపాల్' దర్శకుడు డి.వి.కె.నాగేశ్వరరావు తన ద్వితీయ చిత్రంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.