నిజాం పాలకుల చారిత్రను చాటి చెప్పే సాక్ష్యాధారాలు సేకరించే పనుల్లో హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి నిమగ్నమైవున్నారు. నిజాం పాలకుల పరిపాలనా భవననిర్మాణానికి నిలువుటద్దంగా మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నిలుస్తుంది. అయితే ఈ పాలకుల ఛాయా చిత్రాలను, పెయింటింగ్స్ను సేకరించే పనుల్లో నగరానికి చెందిన మహ్మద్ సఫీల్ అనే వ్యక్తి నిమగ్నమైవున్నాడు. 11 సంవత్సరాల వయస్సు నుంచే ఈ ఫోటోల సేకరణలో నిమగ్నమైన ఆయన ఇప్పటికే పలు రకాల ఫోటోలను, నాణేలను, దుస్తులు, ఇతర సామాగ్రిని సేకరించారు.
224 సంవత్సరాల పాటు హైదారాబాద్ను పాలించిన నిజాం పాలకులు భాగ్యనగరిలో ఎన్నో చారిత్రక కట్టడాలను నిర్మించారు. వీటిలో ప్రధానమైనది ఛార్మినార్. ఐదో మోలీ కుతుబ్షా నిర్మించిన ఈ కట్టడం నేటికి చెక్కుచెదరకుండా ఉంది. 48.7 మీటర్ల ఎత్తు కలిగిన ఈ కట్టడ నిర్మాణం పూర్తి చేసేందుకు ఆ రోజుల్లోనే తొమ్మిది లక్షల రూపాయల వరకు ఖర్చు చేసినట్టు రికార్డులు చెపుతున్నాయి.
ప్రత్యేక చరిత్ర కలిగిన ఛార్మినార్ నిర్మాణంలో 14 వేల టన్నుల బరువు కలిగిన రాళ్ళను వినియోగించారు. అలాగే హుస్సేన్ సాగర్ ఒకటి. హైదరాబాద్ వాసుల మంచినీటి వినియోగానికి నిర్మించిన రిజర్వాయర్. ఇలా.. నిజాం పాలకుల ఔచిత్వాన్ని చాటి చెప్పే ఎన్నో సాక్ష్యాధారాలు పలువురి వద్ద ఉన్నాయని, వీటిని ప్రభుత్వం, పురవాస్తు శాఖలు సేకరించి భద్రపరచాలని ఆ ఔత్సాహికుడు విజ్ఞప్తి చేస్తున్నారు.