పాడేరు 12వ మైలు ట్రైలర్ ఆకర్షించింది : రాజేంద్రప్రసాద్

దేవీ

బుధవారం, 4 జూన్ 2025 (20:41 IST)
Paderu 12th Mile Trailer Launched by Rajendra Prasad
సత్యం రాజేష్, శ్రవణ్ , కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో ఎన్. కె దర్శకత్వంలో గ్రంధి త్రినాధ్ ప్రొడ్యూసర్ గా లోతేటి కృష్ణ కో ప్రొడ్యూసర్ గా సుహాన హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం 'పాడేరు 12వ మైలు' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను నటకిరీటి రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు. హైదరాబాద్, వైజాగ్ మరియు పాడేరు లో అధిక భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు పీఆర్ నేపధ్య సంగీతం అందించారు. నభ మాస్టర్ ఫైట్స్, కళాదర్ నృత్యాలు ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కానున్నాయి.
 
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ...పాడేరు 12వ మైలు సినిమా ట్రైలర్ చాలా చక్కగా ఉంది, సినిమా కూడా అందరిని అలరిస్తుందని ఆశిస్తున్నాను, డైరెక్టర్ ఎన్.కె అలాగే నిర్మాత గ్రంధి త్రినాధ్ కు మంచి పేరు రావాలని, ఇలాంటి మరిన్ని కొత్త కాన్సెప్ట్ సినిమాలు రావాలని కోరుకుంటున్నాను, జూన్ 6న అందరూ ఈ సినిమాను థియేటర్స్ లో చూసి ఆనందించాలని అన్నారు. 
 
ఈ సందర్భంగా డైరెక్టర్ ఎన్. కె మాట్లాడుతూ... నా స్నేహితుడు త్రినాధ్ నిర్మాతగా నేను డైరెక్టర్ గా మీ ముందుకు పాడేరు 12వ మైలు సినిమాతో వస్తున్నాను.జూన్ 6 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది, సత్యం రాజేష్, ప్రభాకర్, శ్రవణ్ అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ మొదకొండమ్మ తల్లి ఆశీస్సులతో ఈ సినిమాను ముందుకు తీసుకొని వెళుతున్నాము. పొలిమేర , పొలిమేర 2 తరువాత సత్యం రాజేష్ నటించిన పాడేరు 12వ మైలు సినిమా సస్పెంస్ అండ్ లవ్ ఎలెమెంట్స్ తో రాబోతోంది, మాకు సపోర్ట్ చేస్తున్న అందరికి కృతజ్ఞతలు. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను అన్నారు.
 
నిర్మాత గ్రంధి త్రినాధ్ మాట్లాడుతూ... పాడేరు 12వ మైలు సినిమా బాగ వచ్చింది, డైరెక్టర్ , యాక్టర్స్ అందరూ బాగా సపోర్ట్ చెయ్యడంతోనే మా సినిమా ఇంత కలర్ ఫుల్ గా ఉంది, శ్రీ పాడేరు మొదకొండమ్మ తల్లి బ్లెస్సింగ్స్ మా పై ఎప్పుడూ ఇలానే ఉండాలని, ప్రేక్షకులు, మీడియా వారు మా సినిమాను తప్పకుండా పాజిటీవ్ గా రిసీవ్ చేసుకుంటారనే నమ్మకం ఉంది, ఇదివరకు మేము విడుదల చేసిన టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభించింది, సినిమా కూడా నచ్చుతుందని నమ్మకంగా ఉందన్నారు.
 
ఈ చిత్రానికి ఎడిటర్ శివ శర్వాని అలాగే సినిమాటోగ్రఫీ జి. అమర్ అందిస్తున్నారు ఈ మూవీ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్నాయి. గడ్డం నవీన్, షేకింగ్ శేషు, ముకేష్ గుప్త, కె.ఏ.పాల్ రాము, సూర్య, సమీర్, చిట్టిబాబు, మురళి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు