మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

దేవీ

శనివారం, 31 మే 2025 (18:17 IST)
Naresh Agastya, Rabia Khatun, Vipin, Uma Devi Kota
హీరో నరేష్ అగస్త్య అప్ కమింగ్ మూవీ మేఘాలు చెప్పిన ప్రేమ కథతో అందరినీ ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రం సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఉమా దేవి కోట నిర్మిస్తున్నారు. విపిన్ దర్శకత్వం వహించిన కంటెంట్-రిచ్ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ఇది. ఫస్ట్-లుక్ పోస్టర్ తో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన తర్వాత, మేకర్స్ ఇప్పుడు టీజర్ ను లాంచ్ చేశారు.
 
ఈ కథ ఒక ప్రతిభావంతమైన సంగీతకారుడి చుట్టూ తిరుగుతుంది. అతడు ఒక గొప్ప ఆల్బమ్‌కి స్ఫూర్తి పొందేందుకు ప్రశాంతమైన పర్వతప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఓ అమ్మాయిని కలుస్తాడు. ఈ ఇద్దరి జర్నీ హృదయానికి హత్తుకునే బంధాన్ని తెరపై ఆవిష్కరిస్తాయి. టీజర్ చివర్లో హీరో లేచిపోయిన జంటని చూశావా అని హీరోయిన్ ని సరదాగా అడిగే సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
 
నరేష్ అగస్త్య తన పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. రబియా ఖతూన్ లైవ్లీగా కనిపించింది రాధికా శరత్‌కుమార్  కథకు బలాన్నీ, వాల్యూని జోడించుతుంది. దర్శకుడు విపిన్ ఒక అందమైన ప్రేమకథను ఎంచుకున్నారు, అద్భుతమైన పర్వతప్రాంతంలోని నేపథ్యంలో సాగుతుంది, అక్కడ సంగీతం ఒక కీలకమైన పాత్రను పోషిస్తుంది. సినిమాటోగ్రాఫర్ మోహన కృష్ణ సహజ సౌందర్యాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరణ్ మ్యూజిక్ మ్యాజికల్ గా వుంది. డైలాగ్స్ కట్టిపడేస్తున్నాయి. ఆర్ట్ డైరెక్టర్‌గా తొటా తరణి, ఎడిటర్‌గా మార్తాండ్ కె. వెంకటేష్ అద్భుతమైన వర్క్ అందించారు. టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఈ చిత్రం గ్రాండ్ థియేట్రికల్ విడుదల కోసం ప్రేక్షకుల్లో క్యురియాసిటీని పెంచింది.
 
డైరెక్టర్ విపిన్ మాట్లాడుతూ, మా సినిమాలో ప్రిన్స్ రామ వర్మ గారినే పెద్ద సంగీత విద్వాంసులు, ట్రావెల్ కోర్ వారసులు ఒక ఇంపార్టెంట్ గెస్ట్ రోల్ చేశా.రు ఆయన రాచరికాన్ని అన్నిటిని త్యాగం చేసి మంగళంపల్లి వారి దగ్గర 18 సంవత్సరాలు సంగీత సాధన చేశారు. అలాంటి స్పెషల్ పర్సన్ మన సినిమాలో పాడారు. అలాగే నటించారు. ఇందులో ఒక పాట ఉంది. అందులో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయలేదు. కేవలం నేచురల్ వాయిసెస్ మాత్రమే వాడడం జరిగింది. అది చాలా అరుదైన పాటగా నిలుస్తుందని భావిస్తున్నాను. వాల్పరై అనే బ్యూటిఫుల్ లొకేషన్లో జరిగే బ్యూటిఫుల్ కథ ఇది. మీ అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది'అన్నారు
 
నిర్మాత ఉమాదేవి మాట్లాడుతూ, నా జీవితంలో కే విశ్వనాథ్, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని కలవడం ఓ భాగ్యం. ఈ ప్రయాణంలో వారి దగ్గర చాలా నేర్చుకున్నాను. మంచి సినిమా తీయాలని ఈ ప్రొడక్షన్ హౌస్ స్థాపించాను. కనీసం ఒక ఐదు సినిమాలు,  ప్రతి సినిమాలో కళ ని కనెక్ట్ చేయాలనేది నా ఆశ. అందుకే ఈ సినిమాని మొదట మ్యూజిక్ కి ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా తీయడం జరిగింది. ఈ సినిమాని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి అంకితం చేస్తున్నాను. కోయంబత్తూర్ లో ఒక హిల్ స్టేషన్లో ఈ సినిమాని చిత్రీకరించడం జరిగింది అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు