విక్రమ్ ల్యాండింగ్ ముహూర్తం ఖరారు.. జాబిల్లిపై తొలి అడుగు ఎపుడంటే...

మంగళవారం, 20 ఆగస్టు 2019 (17:57 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో గత నెల 22వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్ 2 వాహకనౌక విజ‌య‌వంతంగా లూనార్ ఆర్బిట్‌లోకి ప్ర‌వేశించిన‌ట్లు ఇస్రో ఛైర్మ‌న్ కే.శివ‌న్ మంగళవారం వెల్లడించారు. 
 
ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సెప్టెంబ‌రు 2వ తేదీన చంద్ర‌యాన్ ‌2కు సంబంధించి మ‌రో కీల‌క ఘ‌ట్టం ఉంటుంద‌న్నారు. ఆ రోజున ఆర్బిటార్ నుంచి ల్యాండ‌ర్ వేరుప‌డుతుంద‌న్నారు. ఇక సెప్టెంబ‌ర్ 3వ తేదీన సుమారు మూడు సెక‌న్ల పాటు ఓ చిన్న‌పాటి ప్ర‌క్రియ ఉంటుంద‌ని శివ‌న్ వివరించారు. 
 
ఆ ప్ర‌క్రియ‌తో ల్యాండ‌ర్ ప‌నితీరు తెలుస్తుంద‌న్నారు. ఇక సెప్టెంబ‌ర్ 7వ తేదీన‌, తెల్ల‌వారుజామున‌ 1.55 నిమిషాల‌కు చంద్రుడి ఉప‌రిత‌లంపై విక్ర‌మ్ ల్యాండ‌ర్ దిగుతుంద‌న్నారు. తామంతా మాన‌వ ప్ర‌య‌త్నం చేశామని, ప్రస్తుతం ల‌క్ష్యానికి మ‌రింత చేరువైన‌ట్లు ఇస్రో త‌న ట్విట్ట‌ర్‌లో చెప్పింది. 

 

#WATCH Indian Space Research Organisation (ISRO) Chief K Sivan explains the intricacies of the #Chandrayaan2 mission using a miniature model. pic.twitter.com/Wqux0EflWZ

— ANI (@ANI) August 20, 2019

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు