విశ్వాస పరీక్షను ప్రవేశపెట్టిన యడ్యూరప్ప.. రాజీనామా లేఖ సిద్ధం?

శనివారం, 19 మే 2018 (15:56 IST)
కర్ణాటక రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. శనివారం సాయంత్రం 4 గంటలకు సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఆ రాష్ట్ర శాసనసభలో విశ్వాస పరీక్షను ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే, ఆయన విశ్వాస పరీక్షలో ఓడిపోతామన్న నిర్ణయానికి వచ్చి రాజీనామా లేఖను సిద్ధం చేసుకుని తన ప్యాకెట్‌లో పెట్టుకుని తన ప్రసంగాన్ని ప్రారంభించినట్టు తెలుస్తోంది.
 
అంతకుముందు శనివారం ఉదయం 11 గంటలకు ఆ రాష్ట్ర శాసనసభ ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత భోజన విరామ సమయం ప్రకటించారు. పిమ్మట మధ్యాహ్నం 3.30 గంటలకు కొలువుదీరిన తీరిన తర్వాత మరికొంతమంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. 
 
ఈ ప్రమాణ స్వీకారాల తంతు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి యడ్యూరప్ప విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. విశ్వాస పరీక్షలో యడ్యూరప్ప ప్రసంగం తర్వాత యడ్యూరప్ప గవర్నర్ వజూభాయ్ వాలాతో సమావేశమై తన రాజీనామా లేఖను సమర్పిస్తారన్న ఊహాగానాలు వస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు