మరో అద్భుతం, మనిషికి పంది గుండె అమర్చారు, విజయవంతం

మంగళవారం, 11 జనవరి 2022 (11:29 IST)
అమెరికా దేశంలో సర్జన్లు 57 ఏళ్ల వ్యక్తికి జన్యుపరంగా మార్పు చెందిన పంది గుండెను విజయవంతంగా అమర్చారు. ఇది వైద్యపరమైన మొదటి విజయవంతమైన కేసు. ఇది అవయవ విరాళాల దీర్ఘకాలిక కొరతను పరిష్కరించడంలో సహాయపడుతుందని అంటున్నారు.

 
యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ స్కూల్ సోమవారం ఒక ప్రకటనలో తెలుపుతూ... మనిషికి పంది గుండెను అమర్చిన శస్త్రచికిత్స విజయవంతమైంది. ఇది జంతువు నుండి మానవులకు అవయవ మార్పిడికి ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. 

 
రోగి, డేవిడ్ బెన్నెట్, మానవ అవయవాల మార్పిడికి అనర్హుడని భావించారు. గ్రహీత అంతర్లీన ఆరోగ్యం చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ నిర్ణయం తరచుగా తీసుకోబడుతుంది. శస్త్రచికిత్స అనంతరం రోగి ఇప్పుడు కోలుకుంటున్నాడు. కొత్త అవయవం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి జాగ్రత్తగా పర్యవేక్షించబడుతోంది.

 
 గుండె-ఊపిరితిత్తుల బైపాస్ మెషీన్‌పై గత కొన్ని నెలలుగా మంచం పట్టిన బెన్నెట్ ఇలా చెప్పాడు. "నేను కోలుకున్న తర్వాత మంచం పైనుండి లేవడానికి ఎదురుచూస్తున్నాను.'' అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు