ట్విట్టర్‌ను పక్కనబెట్టేసిన ఎలాన్ మస్క్.. కుప్పకూలిన షేర్లు

శుక్రవారం, 13 మే 2022 (16:52 IST)
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ను కైవసం చేసుకోవాలని భావించిన అమెరికా కుబేరుడు ఎలాన్ మస్క్ ఇపుడు దాన్ని పక్కనబెట్టేశారు. దీంతో ట్విట్టర షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలనుకున్న డీల్‌ను తాత్కాలికంగా పక్కనపెట్టేసినట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
స్పామ్, ఫేక్ అకౌంట్లకు సంబంధించిన వివరాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, అందుకే ఈ డీల్‌ను తాత్కాలికంగా హోల్డ్‌లో పెడుతున్నట్టు తెలిపారు. ట్విట్టర్ మొత్తం ఖాతాల్లో ఈ ఖాతాల సంఖ్య ఐదు శాతం కంటే తక్కువగా ఉంటాయని ట్విట్టర్ చెబుతోంది. 
 
కానీ, ఈ లెక్క తేల్చాలని, పక్కా వివరాలు అందించాలని ఎలాన్ మస్క్ డిమాడ్ చేస్తున్నారు. ఈ వివరాలు అందించేంత వరకు ఈ డీల్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎలాన్ మస్క్ ట్వీట్‌తో ట్విట్టర్ షేర్ల ధర 20 శాతం మేరకు పడిపోయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు