వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అర్చకుల కొట్లాట..

సెల్వి

గురువారం, 18 జనవరి 2024 (10:28 IST)
Vadakalai Brahmins
సుప్రసిద్ధ కాంచీపురంలో వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అర్చకులు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ప్రబంధాలు పాడటంతో వడకలై-తెన్ కలై అనే విభాగానికి చెందిన అర్చకుల మధ్య జగడం చోటుచేసుకుంది.
 
అర్చకులు నడిరోడ్డుపై జగడానికి పాల్పడ్డారు. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయం వైష్ణవాలయంలో సుప్రసిద్ధమైంది. ఈ ఆలయంలో ఉత్సవ, ఊరేగింపు కార్యక్రమంలో ప్రబంధాలు పాడే హక్కుపై వడనిలై-తెన్ కలై అర్చకుల మధ్య గొడవ జరిగింది. 
 
ఈ వ్యవహారం మధ్య వాగ్వాదం, సంఘర్షణ తరచుగా జరుగుతుంది. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయం స్వామివారి ఊరేగింపులో ప్రబంధం పాడడంలో వడకలై-థెన్‌కలై అర్చకుల మధ్య ఘర్షణ జరిగింది.
 
వడకలై - థెన్‌కలై ప్రివినర్ నడి రోడ్డులో అర్చకులు ఒకరిపై ఒకరు దాడి చేసిన సంఘటనను చూసి ప్రజలు దానిని సెల్‌ఫోన్‌లో వీడియో తీయడం ప్రారంభించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

கொலை மிரட்டலில் முடிந்த வடகலை - தென்கலை பிரச்னை!#Kanchipuram pic.twitter.com/AlA725YUIZ

— PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) January 18, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు