చదువులో సున్నా-వ్యవసాయంలో హీరో: టమాటా సాగుతో కోటీశ్వరుడైన తెలంగాణ రైతు

సోమవారం, 24 జులై 2023 (21:10 IST)
చదువులో సున్నా.. వ్యవసాయంలో హీరో.. టమాటా సాగుతో కోటీశ్వరుడుగా తెలంగాణ రైతు మారాడు. వ్యవసాయ పరిశ్రమలో నిమగ్నమై చాలా మంది నష్టపోతున్నారని వాపోతుంటే, ఈ ఏడాది టమాటా ధరల పెరుగుద కొద్ది మంది రైతులను లక్షాధికారులను చేసింది. 
 
తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా గౌడిపల్లి గ్రామానికి చెందిన మహిపాల్ రెడ్డి రైతు. చిన్నవయసు నుంచి ఆయనకు చదువు ఎక్కలేదు. 10వ తరగతి కూడా పాస్ కాలేకపోయాడు. ఆ తర్వాత చదువుపై ఆసక్తి లేకపోవడంతో వ్యవసాయం చేశాడు. టమోటాతో పాటు మహిపాల్ రెడ్డి వరి కూడా సాగు చేశాడు. 
 
కానీ వరి సాగులో లాభం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ 15న టమోటా సాగును ప్రారంభించాడు. 8 ఎకరాల్లో టమాట సాగు చేశాడు. కోతకు సిద్ధంగా ఉన్న పంటను జూన్ 15న మార్కెట్‌కు తీసుకొచ్చాడు. అక్కడ టమోటాలు అమ్ముతూ కోటీశ్వరుడయ్యాడు. ఒక నెలలో సుమారు 8,000 టమాట పెట్టెలను విక్రయించి రూ.1.8 కోట్లు సంపాదించాడు. సీజన్ ముగిసే నాటికి దాదాపు రూ.2.5 కోట్లు రాబట్టాలని ఆకాంక్షిస్తున్నాడు. 
 
అప్పట్లో తెలంగాణ రాజధాని హైదరాబాద్ మార్కెట్‌కు ఆంధ్రప్రదేశ్‌ నుంచి టమాట సరఫరా కాస్త ఆగింది. దాంతో హైదరాబాద్‌కు టమాటాలు పంపడం మొదలుపెట్టాడు. అక్కడ టమాటా కిలో రూ.100 చొప్పున విక్రయించి 15 రోజుల్లో దాదాపు రూ.1.25 కోట్లు సంపాదించాడు. 
 
మహిపాల్ ఎకరం పంటకు రూ.2 లక్షలు వెచ్చించి నాణ్యమైన పంటను తయారు చేశాడు. సాగుకు మొత్తం రూ.16 లక్షలు ఖర్చయిందని తెలిపారు. పొలంలో 40 శాతం పంట మిగిలి ఉందని, దానిని కూడా త్వరలో మార్కెట్‌కు తీసుకువస్తామని రెడ్డి చెప్పారు.
 
చాలా మంది పట్టభద్రులు ఉద్యోగాల కోసం వెతుకుతున్నట్లు వార్తలు వస్తుండగా.. పదో తరగతి కూడా పాసవ్వని మహిపాల్‌రెడ్డి వ్యవసాయం చేస్తూ కోటీశ్వరుడయ్యాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు