ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే సంతానం తప్పనిసరి...

బుధవారం, 13 జూన్ 2018 (12:28 IST)
చాలా మంది సంతాన లేమితో బాధపడుతుంటారు. ఇలాంటి వారికి ఇంటిలోని వాస్తు దోషం వలన సంతాన భాగ్యం లేదనే సందేహం వారిని వెంటాడుతూ ఉంది. ఇదే విషయంపై వాస్తు నిపుణులను సంప్రదిస్తే కొన్ని విషయాలు తెలిపారు. మరి అవేంటో తెలుసుకుందాం.
 
''ప్రధానంగా ఈశాన్యం జననానికి'', ''నైరుతి మరణానికి సంకేతాలు'' అనేవి వాస్తు శాస్త్రంలో చెప్పుకునే సామెతలు. ఈశాన్యంలో లోపం ఉన్నప్పుడు పుత్ర సంతానం లేకపోవడం జరుగుతుంది. అలాగే ఇంటికి ఈశాన్యం తెగిపడి, మూతపడి ఉండటం మంచిది. నైరుతిలో బావి ఉండడం వంశ అభివృద్ధికి విఘాతాన్ని కలిగిస్తుంటాయి.
 
అలాంటి గృహంలోని సభ్యులు మంచి వాస్తున్న ఇంటిలోకి వెళితే సంతానం కలుగుతుందా అనే సందేహం వారి ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. నిజమే ఇలాంటి ఇంట్లోకి వెళ్లితే సంతానం కలిగే అవకాశం ఉంది. ఐతే, ఈశాన్యంలోపం ఉన్న గృహంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారన్నా దానిపై వారి ఆరోగ్య క్షీణతలో వచ్చిన మార్పులపై కొత్త ఇంటి ఫలితం ఆలస్యంగా వచ్చే అవకాశముంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 
 
ఒక ప్రదేశం మనిషి భావాలను, ఆవేశాలను నియంత్రించి నట్టుగా ఈశాన్య, నైరుతి దశలు సక్రమమైనప్పుడు పురుష వీర్యశక్తిని కూడా పునరుద్ధరింపజేస్తాయి. ఇక్కడి ప్రధాన అంశం ఏమిటంటే కొత్త ఇల్లు కట్టేటప్పుడు తూర్పు, ఈశాన్య సింహద్వారంగా ఉండాలి. ఈశాన్యం మూసివేయబడిన వాస్తును ఇంటిలోనికి చేర్చాలి.
  
ఆ ఇంటి దిశల డిగ్రీ శాతం నూరు ఉంటే మంచి ఫలితాలు పొందవచ్చును. కొత్త ఇంట్లో చిన్న పిల్లల బొమ్మలను పడకగదిలో పెట్టుకుని తూర్పు వైపు తలపెట్టి నిద్రించాలి. ఆత్మ సంకల్పం, దిశ ప్రభావం ద్వారా ఆలస్యంగానైన సంతానం చక్కగా కలుగుతుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు