కావలసిన పదార్థాలు : పొడి పొడిగా వండిన అన్నం.. 6 కప్పులు మామిడి, కొబ్బరి తురుము.. చెరో 2 కప్పులు మొలకెత్తిన పెసళ్లు.. 2 కప్పులు క్యారెట్, క్యాప్సికమ్ తరుగు... చెరో 2 కప్పులు మినప్పప్పు, నువ్వులు.. చెరో 4 టీ. జీడిపప్పు.. వంద గ్రా. శెనగపప్పు, మినప్పప్పు.. 2 టీ. కొత్తిమీర తరుగు.. 4 టీ. ఆవాలు, జీలకర్ర, పసుపు.. 2 టీ. చొప్పున పచ్చిమిర్చి.. 10 పసుపు.. 2 టీ. నూనె, ఉప్పు.. తగినంత
తయారీ విధానం : ముందుగా నువ్వులు, మినప్పప్పులను వేయించి పొడిచేసి ఉంచుకోవాలి. పొడి పొడిగా వార్చిన అన్నంలో నువ్వులు, మినప్పప్పు పొడితోపాటు మామిడి, కొబ్బరి తురుము, పసుపులను వేసి బాగా కలియబెట్టాలి. తరువాత మొలకెత్తిన పెసళ్లను ఉడికించి ఉంచాలి.
ఇప్పుడు బాణలిలో కాస్త నూనె వేసి జీడిపప్పు, శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా వేయించాలి. అందులోనే క్యాప్సికం, క్యారెట్ తరుగు, పెసళ్లను వేసి మరికాసేపు వేయించాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలపాలి. చివర్లో కొత్తిమీర తరుగు పైన చల్లాలి. అంతే రుచికరమైన మ్యాంగో ఫ్రైడ్రైస్ తయార్..!!