న్యూఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్లో భాగంగా భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ అనూహ్య పరాజయం పాలైయ్యాడు. 75 కేజీల విభాగంలో బంగారు పతకం సాధిస్తాడని అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తుండగా, ఈ ప్రపంచ నెంబర్వన్ అందరిని నిరాశపరుస్తూ సెమీఫైనల్లోనే నిష్ర్కమించాడు.
కాగా.. విజేందర్ సింగ్ 3-4 పాయింట్ల తేడాతో ఇంగ్లండ్ బాక్సర్ ఆంథోనీ ఒగోగో చేతిలో ఓడాడు. దీంతో 75 కేజీల విభాగంలో విజేందర్ సింగ్ కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2006 మెల్బోర్న్ గేమ్స్లో రజత పతకం సాధించిన విజేందర్, 2008 బీజింగ్ ఒలింపిక్స్లోనూ, 2009 ప్రపంచ ఛాంపియన్షిప్ల్లో కాంస్య పతకాలను కైవసం చేసుకున్నాడు.
కానీ కామన్వెల్త్ గేమ్స్లో విజేందర్ సింగ్ అభిమానులను, ప్రేక్షకులను నిరాశ పరిచాడు. అయితే పసిడి పోరుకు సురంజయ్, మనోజ్, పరమ్జీత్లు సన్నద్ధమవుతున్నారు.