వైఎస్ రాజశేఖర్రెడ్డితో పాటు హెలికాప్టర్లో ప్రయాణించిన వారు ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని నిమిషాలు మాత్రమే ప్రాణాలతో ఉన్నారని వైద్య నిపుణులు తెలిపారు.
హెలికాప్టర్ ప్రమాదం తర్వాత కొద్ది నిమిషాల పాటు వారు ప్రాణాలతోనే ఉన్నారని ఎంఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు.
హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురికి ఒకే రకమైన గాయాలున్నాయని ఫొరెన్సిక్ విభాగ నిపుణులు తెలియజేశారు.
ఇదిలావుండగా వైఎస్ కుడిచేయికి చెందిన రెండువేళ్లు తెగిపోయాయన్నారు. పూర్తి నివేదికను పోలీస్శాఖకు అప్పగించినట్లు ఫోరెన్సిక్ విభాగం తెలిపింది.