జనవరి-మార్చి మధ్యకాలంలో జిందాల్ స్టీల్ ప్లాంట్ ప్రారంభం
ఓమెన్లో కొత్తగా నిర్మిస్తున్న షదీద్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్లో వాణిజ్యపరమైన ఉత్పత్తి వచ్చే జనవరి - మార్చి నాటికి ప్రారంభమవుతుందని జిందాల్ స్టీల్ అండ్ పవర్ ప్లాంట్ ఆదివారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ ప్లాంట్ను ఇటీవలే 464 మిలియన్ డాలర్లకు కైవసం చేసుకుంది.
దీనిపై జేఎస్పిఎల్ డైరక్టర్ సుషీల్ మారో ఒక న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ.. జనవరి-మార్చి మధ్య కాలంలో ఈ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు. షోహార్ ఇండస్ట్రియల్ పోర్ట్ ఏరియాలో ఈ ప్లాంట్ ఉంది. యూఏఈకు చెందిన ఏఐ ఘైత్ హోల్డింగ్స్ షోదీద్ భారత కంపెనీకి విక్రయించింది. ఈ కంపెనీలో వచ్చే 2012 నాటికి ప్లాంట్ కెపాసిటీ వినియోగం 80 శాతం మేరకు పెరగనుంది.