భారతదేశ వృద్ధి ప్రణాళికను బలోపేతం చేయడానికి స్కోడా ఆటో ఫ్రేమ్‌వర్క్‌

ఐవీఆర్

ఆదివారం, 22 జూన్ 2025 (20:17 IST)
ఈ 2025 ఏడాది స్కోడా ఆటోకు ప్రపంచవ్యాప్తంగా ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. భారతదేశంలో 130 ఏళ్ల గొప్ప చరిత్రను, 25 ఉత్తేజకరమైన ఏడాదులను వేడుకగా ఆచరించుకుంటోంది. వినియోగదారులకు దగ్గరగా ఉండే వ్యూహంపై ఆధారపడి, స్కోడా ఆటో ఇండియా భారత మార్కెట్లో ఊపును పెంచేందుకు కీలకమైన బ్రాండ్, ఉత్పత్తి, నెట్‌వర్క్, కస్టమర్-కేంద్రీకృత చొరవలను వివరించింది.
 
ఈ సందర్భంలో స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ, ‘‘ఐరోపా వెలుపల స్కోడా ఆటోకు భారతదేశం అత్యంత ముఖ్యమైన వృద్ధి మార్కెట్. బలమైన ఉద్దేశంతో, స్పష్టమైన దృష్టి కోణం, అమలులో చురుకుదనంతో దృఢమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న బ్రాండ్‌ను నిర్మించడంపై మేము దృష్టి సారించాము. మా ఉత్పత్తిని మరింత వ్యూహాత్మకంగా వినియోగదారుల అభివృద్ధి చెందుతున్న అవసరాలను, ఆకాంక్షలను నెరవేర్చేలా ఉంటూ, మా పురోగతి ప్రయాణాన్ని మరింత వేగంగా ముందుకు తోడ్కొని వెళుతుంది. మేము వినియోగదారులకు దగ్గరవుతున్నాము. వ్యూహాత్మకంగా మా నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటూ, నాణ్యత, భద్రత, విలువల మా వారసత్వాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాము. మా అన్ని వ్యాపార ప్రాధాన్యతలలో వాహన చక్రాలు ప్రయాణిస్తుండడంతో, భారతదేశంలో ముందుకు సాగుతూ, మేము బ్రాండ్‌ను గణనీయంగా బలోపేతం చేసే ఏడాదిగా 2025ను మార్చుకున్నాము’’ అని వివరించారు.
 
ధీటైన ఉత్పత్తులు
స్కోడా ఆటో ఇండియా ఉత్పత్తి తన తెలివైన వ్యూహంతో ‘ప్రతి ఒక్కరికీ ఎస్‌యూవీ’, దాని సెడాన్ వారసత్వాన్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతోంది. కైలాక్, కుషాక్, కోడియాక్ ప్రతి ఎస్‌యూవీ ఆకాంక్ష, ధర పాయింట్‌ను తీర్చడంతో, స్కోడా ఆటో ఇండియా స్లావియా, త్వరలో విడుదల చేయనన్న ‘గ్లోబల్ ఐకాన్’ ద్వారా నడిచే తన సెడాన్ వారసత్వాన్ని కూడా నిర్మిస్తోంది.
 
కొత్త మార్కెట్లకు విస్తరిస్తోంది
స్కోడా ఆటో ఇండియా చిన్న నగరాలు, పట్టణాల్లోని (టైర్ II, టైర్ III) మార్కెట్లకు విస్తరించాలనే తన దార్శనికతను కొనసాగిస్తోంది. నేడు 165కి పైగా నగరాలలో అందుబాటులో ఉన్న సేవలను ఈ ఏడాది 200కు పైగా నగరాలకు విస్తరించే లక్ష్యాన్ని కలిగి ఉంది. కంపెనీ ఇప్పటికే 2021లో 120 కస్టమర్ టచ్‌పాయింట్‌ల నుంచి నేడు 290కి పైంచుకుంది. అలాగే, 2025 చివరి నాటికి 350 టచ్‌పాయింట్‌లను లక్ష్యంగా పెట్టుకుంది.
 
కొత్త వ్యాపార మార్గాలను అన్వేషించడం
స్కోడా ఆటో ఇండియా తన సర్టిఫైడ్ ప్రీ-ఓన్డ్ వ్యాపారం వంటి అనుబంధ వ్యాపారాలను మరింత బలోపేతం చేసుకునేందుకు తన వృద్ధికి శక్తినిచ్చే స్పష్టమైన ఉద్దేశ్యాన్ని కలిగి ఉంది. ఇది ఇప్పటికే ప్రభుత్వ సంస్థలు, ఇతర ప్రయాణాలకు అందిస్తోంది. కార్పొరేట్, గ్రామీణ మార్గాలను మెరుగుపరుస్తూనే, ఈ మార్గాల నుంచి మరింత వృద్ధిని పొందడంలో బ్రాండ్ పునరుద్ధరించబడిన చర్యలపై దృష్టి సారించింది.
 
వినియోగదారుని అనుభవాన్ని మెరుగుపరచడం
వినియోగదారుని టచ్‌పాయింట్ల పరిమాణాన్ని విస్తరించడంతో పాటు, స్కోడా ఆటో ఇండియా విధేయతను పెంచడం, నమ్మకాన్ని పెంపొందించడం ద్వారా కొనుగోలు నాణ్యతను, యాజమాన్య అనుభవంపైనా దృష్టి సారిస్తోంది. స్కోడా సూపర్‌ కేర్‌ను దాని అన్ని కార్లలో ప్రామాణికంగా ఉంచడంతో, బ్రాండ్ ఇప్పుడు వినియోగదారులు తమ రెండవ ఏడాది యాజమాన్యం చివరిలో లేదా 30,000 కి.మీ.లు పూర్తి చేసిన తర్వాత (ఏది ముందు అయితే అది) మాత్రమే వారి సాధారణ సేవకు చెల్లించేలా చేస్తుంది. స్కోడా కారును కలిగి ఉన్నప్పుడు పూర్తి మనశ్శాంతిని నిర్ధారించే వారంటీ ప్యాకేజీలు, ఇతర సేవా ఆఫర్‌లు కూడా ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు