నవంబరు 1న తెలంగాణ పీఈ-సెట్ ఫలితాలు

ఆదివారం, 31 అక్టోబరు 2021 (16:48 IST)
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (TSPECET-2021) పరీక్షా ఫలితాలను నవంబరు ఒకటో తేదీ సోమవారం విడుదలకానున్నాయి. ఈ విషయాన్ని పీఈ సెట్‌ కన్వీనర్‌ తెలిపారు. 
 
హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆర్‌ లింబ్రాది, పీఈ సెట్‌ ఛైర్మన్‌, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ గోపాల్‌రెడ్డి ఫలితాలను ప్రకటిస్తారని తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. 
 
కాగా, యూజీడీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్‌ పీఈసెట్‌ (తెలంగాణ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ను) మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇటీవల జరిగాయి.
 
పూర్తి ఈవెంట్స్‌ ఎంజీయూలో జరుగాల్సి ఉండగా.. ఉండగా కొవిడ్‌ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి ఒకే రోజులో పూర్తి చేశారు. ఈ పరీక్షల ఫలితాలను సోమవారం వెల్లడించనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు