"కింగ్స్ ఎలెవన్"లో ముగ్గురు దేశవాళీలకు చోటు..!

FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్-3 కోసం పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఫ్రాంచైజీ ముగ్గురు దేశవాళీ ఆటగాళ్లకు స్థానం కల్పించింది. వారిలో మీడియం పేసర్ లవ్ అబ్లిశ్, షాలాబ్ శ్రీ వాస్తవ, వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్ మన్విందర్ బిస్లాలు ఉన్నట్లు కోచ్ టామ్ మూడీ వెల్లడించాడు.

ఈ ముగ్గురు దేశవాళీ ఆటగాళ్లను చేర్చుకోవటంవల్ల కింగ్స్ ఎలెవన్ బలోపేతం కావటంతోపాటు, జట్టులో పునరుత్తేజం కలుగుతుందని టామ్ మూడీ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్-3లో రాణించాలనే తపనతోపాటు.. బ్యాటింగ్, బౌలింగ్ చేయగల సత్తా వారికి ఉందనీ, ఈ సీజన్‌లో ఎలాంటి పోటీనైనా తట్టుకునేందుకు కింగ్స్ జట్టు సిద్ధంగా ఉందని అన్నాడు.

కాగా.. ముగ్గురు ఆటగాళ్ల చేరికను జట్టు కెప్టెన్ కుమార సంగక్కర స్వాగతించాడు. రంజీ ట్రోఫీలో వీరు అద్భుతమైన ప్రతిభను కనబర్చారని సంతోషం వ్యక్తం చేశాడు. ఆటపట్ల వీరికుండే అంకితభావం, నైపుణ్యం జట్టుకు ఎంతగానో దోహదపడుతుందని, ఈ ముగ్గురి చేరికతో కింగ్స్ జట్టులో మొత్తం 32 మంది అయ్యారన్నాడు. 10మంది విదేశీ ఆటగాళ్లు, 8 మంది భారత ఆటగాళ్లు, 14 మంది దేశవాళీ క్రికెటర్లు జట్టులో ఉన్నారని సంగక్కర వివరించాడు.

వెబ్దునియా పై చదవండి