అయితే, చిన్నారికి మూర్ఛ రావడంతో కింద పడిపోయినట్టుగా నమ్మించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆ చిన్నారి అప్పటికే మృతి చెందడంతో వైద్యులు అనుమానించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వేరు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిర్వహించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి వర్గాల ద్వారా ఈ విషయం పోలీసులకు తెలిసింది. ఆ వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చిన్నారి మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు ఆమెపై లైంగికదాడి జరిగిందని, ఊపిరాడకపోవడం వల్ల కలిగిన షాక్తో పాప మరణించిందని ధృవీకరించారు. ఈ ఘటనలో తల్లి, ఆమె ప్రియుడి ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించగా పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. వారిద్దరిపై పోక్సో చట్టం, బీఎన్ఎస్ చట్టాల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.