బాలీవుడ్‌కు వెళుతున్న నందినీరెడ్డి!

గురువారం, 17 ఏప్రియల్ 2014 (21:05 IST)
కృష్ణవంశీ శిష్యురాలిగా పనిచేసి 'అలా మొదలైంది' చిత్రంతో తొలి సినిమాతోనే సక్సెస్‌ సాధించిన దర్శకురాలు నందినీరెడ్డి. నాని, నిత్యమీనన్‌, ఆశిష్‌ విద్యార్థి కాంబినేషన్‌లో జర్నీతో ప్రయాణమై ఆద్యంతం నవ్వులు తెప్పించింది. ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అయి చిత్రాన్ని 100 రోజుల వరకు తీసుకెళ్ళారు. నిత్య మీనన్‌ పెర్‌ఫార్మెన్స్‌ నాని అభినయం బాగా సింకయి యూత్‌కు బాగా వర్కవుట్‌ అయింది. ఈ చిత్రంతోనే తాగుబోతు రమేష్‌ పాత్ర హైలైట్‌ కావడం. దాంతో సినిమాలు వచ్చిపడటం జరిగిపోయాయి.

చాలా గ్యాప్‌ తర్వాత 'జబర్‌దస్త్‌' అనే సినిమా చేసింది. అదికూడా బ్యాండ్‌బాజా భారత్‌కు కాపీ కావడంతో ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దాంతో తెలుగు ఇండస్ట్రీ ఆమెతో సినిమా తీయడానికి ఇంట్రెస్ట్‌ చూపించలేదు. కానీ బాలీవుడ్‌ సంస్థ ఆమెకు ఆఫర్‌ ఇచ్చింది.

అలామొదలైంది హిందీలో తీయమని కబురు చేసింది. లోబడ్జెట్‌ చిత్రంతో తెలుగులో తీసిన ఈ చిత్రం బాలీవుడ్‌లో ఎక్కువస్థాయిలో తీయాలి కనుక.. త్వరలో చర్చలు జరిపి గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తానని నందినీ చెబుతోంది. తెలుగులో అవకాశాలు లేకపోయినా బాలీవుడ్‌లో రావడం ఆనందంగా ఉందంటుంది.

వెబ్దునియా పై చదవండి