తరచూ గొంతులో మంటగా ఉంటే ఇది అసిడిటీ, గ్యాస్ సమస్యలకు మూలంగా గుర్తించాలి. జీర్ణాశయంలో ఉండే ఆమ్లం ఆహారనాళం వైపు అంటే గొంతు వైపుగా పైకి ఎగదన్నుకు వచ్చినప్పుడు ఇలా గొంతు మంటగా అనిపిస్తుంది. దీనిని యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు.
అసిడిటీ, అల్సర్ల సమస్యలున్నప్పుడు యాసిడ్ రిఫ్లెక్స్ తరచుగా అనుభవంలోకి వస్తుంటుంది. చాలా సందర్భాల్లో మంచినీళ్లో, చల్లని మజ్జిగో తాగితే ఉపశమనం కలుగుతుంది. కాని ఇలా తరచుగా గొంతులోకి ఆమ్లం రావడం వల్ల ఆహారనాళంలోని కణాలలో మార్పులు కలిగి గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని పరిశోధకులు సూచించారు.
ఇలాంటి సమస్యతో తరచూ బాధపడుతుండేవారు ఆలస్యం చేయకుండా వేళకు సరైన పౌష్టికాహారం తీసుకుంటుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవంటున్నారు ఆరోగ్యనిపుణులు.