14 సంవత్సరాల తర్వాత సినిమా అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అందులో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్ సినిమాలకే అగ్ర పీఠం వేశారు. ఒక దశలో ఆయా సినిమాలను చూడకుండానే అవార్డు కమిటీ ఎంపిక చేసింది. అవార్డు కమిటీలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పాతకాలం జర్నలిస్టులు వున్నారు. ఇదిలా వుండగా, అసలు తెలంగాణ సినిమాకు సరైన గుర్తింపు దక్కలేదని ఇప్పటికే పలువురు దర్శకులు వాపోయారు.