ఆస్పత్రుల్లో పుట్టి వారాలే గడిచిన పసికందుల విక్రయాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కానీ శిశువుల విక్రయానికి బ్రేక్ వేసేందుకు పోలీసులు దంపతుల అవతారం ఎత్తారు. ఈ ఘటన తమిళనాడులోని శివగంగ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు ఇలా వేషధారణ మార్చడంతో రెండు వారాల శిశువును విక్రయించేందుకు ప్రయత్నించిన వైద్యురాలితో పాటు ఆమె భర్త కూడా పోలీసులు దొరికిపోయారు.
వివరాల్లోకి వెళితే.. శివగంగ జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలిక గర్భం దాల్చింది. అబార్షన్ కోసం శాంచి అనే వైద్యురాలిని సంప్రదించింది. కానీ ఇప్పటికే 8 నెలలు నిండిపోవడంతో అబార్షన్ కష్టమని వైద్యులు తేల్చేశారు. దీంతో ఆ మైనర్ బాలిక ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆ శిశువు తనకు వద్దనడంతో అమ్మేందుకు వైద్యురాలు శాంతి ప్రయత్నించింది.
కానీ సదరు ఆసుపత్రిలో శిశు విక్రయాల రాకెట్ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు వేషం మార్చారు. దంపతుల గెటప్తో బాబును కొనుగోలు చేస్తామంటూ.. డాక్టర్ శాంతితో పాటు ఆమె భర్తను ఆశ్రయించారు. శిశువును అమ్మేందుకు బేరం కుదరడంతో డాక్టర్ శాంతితో పాటు ఆమె భర్తను పోలీసులు రెడ్హ్యాండెడ్గా అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.