చెల్లెలిపై అన్నయ్య అత్యాచారం... బాలిక నీరసంగా వుండటంతో..

బుధవారం, 1 డిశెంబరు 2021 (16:16 IST)
చెల్లెలిపై ఓ అన్నయ్య అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడు కృష్ణగిరిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణగిరి ప్రాంతానికి చెంది విజయ్ అనే యువకుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కానీ విజయ్ తల్లి ఇటీవలే అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. దీంతో విజయ్ సవతి తల్లి ఇంట్లో వుంటున్నాడు. 
 
కానీ, విజయ్ కన్ను మాత్రం సవతి తల్లి 15 ఏళ్ల కూతురుపై పడింది. అంతే చెల్లిని స్కూలులో దింపివస్తానని బైకుపై ఎక్కించుకున్నాడు. కానీ మధ్యలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అనంతరం బాలికను ఇంటివద్ద దింపి ఈ విషయం ఇంట్లో చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అయితే బాలిక నీరసంగా ఉండడం గమనించిన తల్లి నిలదీసి అడగడంతో బాలిక జరిగింది చెప్పింది. 
 
దీంతో ఆమె, బాలికను తీసుకువెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు విజయ్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు