జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తరువాత, దశాబ్దాల నాటి ఒప్పందాన్ని నిలిపివేయాలని భారతదేశం నిర్ణయించింది. ఫహల్గామ్ దాడిలో ఎక్కువ మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిన సింధు జల ఒప్పందం, 1960 నుండి భారతదేశం, పాకిస్తాన్ మధ్య సింధు నది మరియు దాని ఉపనదుల వాడకాన్ని నియంత్రించింది.
ముందుగా, పాకిస్తాన్పై చర్యలకు సంబంధించి ఢిల్లీలో కార్యకలాపాలు పెరిగాయి. ప్రధానమంత్రి మోదీ ఆదివారం, 04 మే 2025న ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి. సింగ్తో సమావేశమయ్యారు. దీనికి ముందు, ప్రధాని మోదీ నేవీ చీఫ్తో కూడా సమావేశమయ్యారు. ఇంకా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.