ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ను రెండోసారి ఆర్బీఐ గవర్నర్ పదవికి పోటీపడకుండా చేశానని.. ఇక తన తదుపరి లక్ష్యం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని బీజేపీ నేత సుబ్రహ్మణ్యయ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ఇంటి ముందు దీక్ష చేస్తున్న బీజేపీ నేత మహేష్ గిరికి మద్దతిచ్చేందుకు వచ్చిన స్వామి మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ తన జీవితం మొత్తం మోసాలు చేసే ఈ స్థాయికి ఎదిగారన్నారు.