కరీంనగర్‌కు సోనియాగాంధీ... కొద్దిసేపు చిరంజీవితో భేటీ...

బుధవారం, 16 ఏప్రియల్ 2014 (16:12 IST)
FILE
బుధవారంనాడు కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగసభకు సోనియాగాంధీ మరికొద్దిసేపట్లో హాజరు కానున్నారు. ఈ సభను టీ కాంగ్రెస్ నాయకులు బ్రహ్మాండంగా నిర్వహించి సోనియా మెప్పు పొందాలని కాళ్లకు బలపాలు కట్టుకుని అక్కడే ఉన్నారు. ఇప్పటికే సోనియా గాంధీ హకీంపేటకు చేరుకుని కరీంనగర్ బయలుదేరుతున్నారు. ఐతే హకీంపేటలో కాంగ్రెస్ కేంద్రమంత్రి చిరంజీవితో కొద్దిసేపు సోనియా గాంధీ ముచ్చటించారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం సీమాంధ్రలో కూడా ఎన్నికల ప్రచారానికి రావాలని చిరంజీవి సోనియాను అభ్యర్థించినట్లు సమాచారం. ఐతే దీనిపై సోనియా గాంధీ త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి