ఇండియన్ మార్కెట్లోకి నోకియా ఆండ్రాయిడ్ ఫోన్లు!

సోమవారం, 10 మార్చి 2014 (17:24 IST)
PR
ఎంతో ఆసక్తిగా చూస్తున్న నోకియా ఆండ్రాయిడ్ ఫోన్లు భారత్‌కు వచ్చేశాయి. వీటిని ఈ రోజు భారత్‌లో విడుదల చేస్తున్నట్లు నోకియా ప్రకటించింది. నోకియా ఎక్స్ గూగుల్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ ఆధారంగా పనిచేస్తుంది. దీని ధర 8,599 రూపాయలు. నోకియా ఎక్స్‌ప్లస్, నోకియా ఎక్స్‌ఎల్ అనే మరో రెండు మోడళ్లు వచ్చే రెండు నెలల్లో భారత్‌లో విడుదల చేయనున్నట్లు నోకియా ప్రకటించింది.

నోకియా ఎక్స్ మోడల్లో ఉన్న ప్రతికూలత ఏమిటంటే గూగుల్ ప్లే స్టోర్‌ను యాక్సెస్ చేసుకోవడానికి వీలవదు. ఆండ్రాయిడ్ అప్లికేషన్ల కోసం నోకియా స్టోర్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, డ్యుయల్ సిమ్ తదితర ఫీచర్లు, మరెన్నో అప్లికేషన్లు ప్రీ ఇన్ స్టాల్డ్‌గా ఇందులో ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి