ప్రత్యక్ష ప్రసారాలను సమర్థించిన సోమనాథ్

చట్ట సభల సమావేశాల సందర్భంగా జరిగే కార్యకలాపాలను ప్రజలు వీక్షించే విధంగా ప్రత్యక్ష ప్రసారాలు ఉండాలని లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే ప్రప్రథమంగా పార్లమెంట్‌కు ప్రత్యేక ఛానల్‌ను ప్రారంభింపచేసి లోక్‌సభ గ్యాలరీని ప్రజల ముంగిటకు తీసుకు వెళ్లిన ఘనత కూడా ఆయదే.

శనివారం ఆయన ఒక రోజు పాటు రాష్ట్రంలో పర్యటించిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చట్ట సభల కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలపై పునరాలోచన చేయడంలో ఔచిత్యం లేదన్నారు. ఏ కొందరు సభ్యులో అదుపు తప్పి వ్యవహరించినంత మాత్రాన మొత్తంగా చట్ట సభ ప్రసారాలను ప్రజలు నేరుగా చూడకుండా నిరోధించడం సరైన చర్య కాదన్నారు.

తమ ప్రతినిధులు ఎలా వ్యవహరిస్తున్నారో ఇంట్లోనే కూర్చొని తిలకించే అవకాశం ఏర్పడిందని.. దీనివల్ల ప్రజాప్రతినిధుల ప్రవర్తనను ప్రజలు బేరీజు వేస్తారన్నారు. శాసనసభా బడ్జెట్‌ తాజాగా రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయడానికే సభా నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిపాదించి.. ఇదే శాసనసభ అభిప్రాయమని (మూడ్‌ ఆఫ్‌ ది హౌజ్‌) వెల్లడించిన విషయం తెలిసిందే.

సభలో కొందరు దుందుడుకుగా వ్యవహరిస్తున్నారని ప్రచారం కోసమే రభస సృష్టిస్తున్నారనే ఆరోపణలు పెరుగుతున్న నేపథ్యంలో సోమనాథ్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

వెబ్దునియా పై చదవండి