కృష్ణా జిల్లా అవనిగడ్డ సెగ్మెంట్కు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శ్రీహరి ప్రసాద్ ఘన విజయం సాధించారు. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఆయన తన ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి అయిన సైకం రాజశేఖర్పై 61,644 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య ఆకస్మిక మృతితో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఉప ఎన్నికకు కాంగ్రెస్, వైసీపీ దూరంగా ఉన్న విషయం విదితమే. దీంతో ఉప ఎన్నికలో బ్రహ్మణయ్య కుమారుడు అంబటి శ్రీహరి ప్రసాద్ బరిలో నిలిచారు.
ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 92,309 ఓట్లు పోలుకాగా, శ్రీహరి ప్రసాద్కు 75,282 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి సైకం రాజశేఖర్కు 13,638 ఓట్లు వచ్చాయి. మరో స్వతంత్ర అభ్యర్థి రావి సుబ్రమణ్యంకు 3,389 ఓట్లు మాత్రమే వచ్చాయి.