టీడీపీ - బీజేపీలతోనే తెలంగాణ అభివద్ధి: చంద్రబాబు

ఆదివారం, 13 ఏప్రియల్ 2014 (10:42 IST)
File
FILE
టీడీపీ, బీజేపీలు అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ... తెలంగాణ అభివృద్ధి చెందాలంటే అందుకు మోడీ ప్రధాని కావాలని, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాలన్నారు.

హైదరాబాద్ తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని, తొమ్మిదేళ్లలో సైబరాబాద్‌ను అభివృద్ధి చేశామని చెప్పారు. ఔటర్ రింగు రోడ్ తమవల్లే సాధ్యమైందని గుర్తు చేశారు. టీడీపీ అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ దోచుకున్నదని ఆరోపించారు. హైదరాబాదును ప్రపంచపటంలో పెట్టిన ఘనత కూడ తమదేనని బాబు చెప్పుకొచ్చారు.

గత పదేళ్లలో కాంగ్రెస్ పాలన అవినీతిలో మునిగిపోయిందని, వారి పాలనలో దొంగల కోసమే ఆర్థిక మండళ్లు ఏర్పాటయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ ఒక దొంగలముఠాగా మారిందని మండిపడ్డారు. విభజన తర్వాత తెలంగాణకు మిగులు బడ్జెట్ వచ్చిందని, దానికి కారణం తాము చేసిన అభివృద్ధేనని బాబు పేర్కొన్నారు. టీఆర్ఎస్‌కు ఓటేస్తే అభివృద్ధికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లేనని అన్నారు.

వెబ్దునియా పై చదవండి