జైలుకెళ్లేందుకు పొన్నాల సిద్ధంగా ఉండాలి : కడియం

బుధవారం, 16 ఏప్రియల్ 2014 (12:55 IST)
IFM
FILE
సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఏ క్షణంలోనైనా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని టీఆర్‌ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. బుధవారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కూడా ఇప్పటికే జైలుకు పోయి వచ్చిండని, ఇక పొన్నాల కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

కాంగ్రెస్ నేతలంతా అవినీతికి పాల్పడినవారేనని ఆరోపించారు. అవినీతిపరుల చేతుల్లో తెలంగాణ పెడ్తారా ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్ నేతలు చేసిన ఉద్యమమేంటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును చివరి క్షణం వరకు అడ్డుకున్న పార్టీ టీడీపీ అని ఆరోపించారు. తెలంగాణ జిల్లాల నాయకులంతా పొత్తు వద్దన్నా టీడీపీతో బీజేపీ జత కలిసిందని విమర్శించారు.

వెబ్దునియా పై చదవండి