పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి: 41 మంది మృత్యువాత

పాకిస్థాన్ ఆత్మాహుతి దాడులతో దద్ధరిల్లింది. ఆప్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలోని బజౌర్ సమీపంలో శనివారం ఉదయం జరిగిన ఆత్మాహుతి దాడిలో 41 మంది మృతి చెందినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు.

ఈ పేలుడులో మరో 60 మందికి పైగా గాయపడ్డారు. ఓ ఆహార సరఫరా కేంద్రం వద్ద రేషన్ సరకుల కోసం బారులు తీరిన స్థానికులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి