మొదట పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పొక్కులు తీసి శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలకు పట్టించాలి. అలా అర గంట సేపు తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో కరివేపాకు వేసి ఒక నిముషం చిటపటాయించాలి.
తర్వాత మసాలా పేస్టులో బాగా ఊరిన రొయ్యలను నూనెలో వేసి మీడియం మంట మీద ఐదు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు బ్రౌన్ కలర్లో వేగుతున్నప్పుడు, అందులో టమోటో గుజ్జు వేసి బాగా మిక్స్ చేస్తూ తక్కువ మంట మీద మరో ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వాత అందులో రెండు కప్పుల నీళ్ళు పోసి మొత్తం మిశ్రమాన్ని ఉడికించుకోవాలి.