పితృపక్షం: 15 రోజుల పాటు ఇలా చేస్తే.. అంతా జయమే..

మంగళవారం, 3 అక్టోబరు 2023 (21:26 IST)
మరణించిన మూడు తరాల పూర్వీకులు పితృలోకంలో వుంటారని విశ్వాసం. పితృపక్షంలో యమధర్మరాజు పితృదేవతలను వారి బంధువులను సందర్శించేందుకు.. వారిచ్చే ఆహారాన్ని స్థూక్ష్మ రూపంలో పొందే అవకాశాన్ని కల్పిస్తారు. 
 
పితృ పక్షం ప్రతిఏటా 15 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సమయంలో ప్రజలు సాధారణంగా గంగా లేదా ఇతర పవిత్ర నదుల ఒడ్డున పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. 
 
అలాగే ఈ ఏడాది 16 రోజుల కాలం పితృపక్షంగా మారింది. ఇది భాద్రపద మాసంలో వస్తుంది. పితృ పక్షం సెప్టెంబర్ 29న ప్రారంభమై అక్టోబర్ 14న ముగుస్తుంది. ఈ ఏడాది 16 రోజుల పాటు ఈ పితృపక్షం వుంటుంది. ఈ రోజుల్లో పితృదేవతలను స్తుతిస్తే సర్వం శుభం జరుగుతుంది. అన్నింటా విజయం వరిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు