వరల్డ్ సూపర్ సిరీస్ గెలుచుకుని.. వచ్చే ఏడాది అంతానికి టాప్-5లో చేరాలన్నదే తన కోరిక అని భారత బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల వెల్లడించింది. సూపర్ సిరీస్లో నెగ్గితే న్యూఢిల్లీ ఆతిథ్యమిస్తోన్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్కు సన్నాహంగా ఉపయోగపడుతుందని జ్వాల అభిప్రాయం వ్యక్తం చేసింది.
దిజు, సైనా, చేతన్ ఆనంద్లతో పాటు తాను కూడా ఒక దశకు చేరుకున్నాం. ర్యాంకుల కంటే మెరుగైన ప్రదర్శనపైనే పెట్టాలని అనుకుంటున్నామని గుత్తా జ్వాలా తెలిపింది. అయితే వచ్చే ఏడాది (2010) చివరికి బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో టాప్-5లో నిలవాలన్నదే తమ కోరిక అని ఆమె చెప్పింది.
ఇంకా దిజుతో జతకట్టిన జ్వాల.. ఈ ఏడాది తమ జోడీ విజయబాటలో పయనించడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేసింది. కామన్వెల్త్ గేమ్స్తో సహా పలు ముఖ్యమైన టోర్నీలు ఆడాల్సిన 2010 సంవత్సరం తమకు చాలా బిజీగా గడవనుందని జ్వాల చెప్పింది. కామన్వెల్త్ గేమ్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం ఎంతో గర్వంగా ఉందని గుత్తా జ్వాల వెల్లడించింది.