ఓపెనర్ సల్మాన్ భట్పై ఏడేళ్ళ నిషేధం విధించినట్టు మీడియాలో వచ్చిన వార్తలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొట్టిపారేసింది. మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడిన సల్మాన్ భట్పై వచ్చే నెలలో దోహాలో జరిగే ఐసీసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని పీసీబీ వెల్లడించింది.
పాకిస్థాన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఓపెనర్ సల్మాన్ భట్ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. దీనిపై అటు పీసీబీ, ఇటు ఐసీసీ దర్యాప్తు చేపట్టాయి. ఇందులో భట్ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడినట్టు తేలింది.
దీంతో భట్పై ఏడు సంవత్సరాల నిషేధంతో పాటు భారీ అపరాధ రుసుం విధించే అవకాశం ఉంది. అయితే, కొన్ని మీడియా సంస్థలు మాత్రం సల్మాన్ భట్పై ఏడేళ్ళ నిషేధం విధించినట్టు వార్తలను ప్రముఖంగా ప్రస్తావించాయి. వీటిని పీసీబీ శనివారం తోసిపుచ్చింది.