కారు డ్రైవ్ చేస్తూ అనంతలోకాలకు చేరుకున్న ఎస్ఐ

ఠాగూర్

మంగళవారం, 4 ఫిబ్రవరి 2025 (12:12 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద కారు - బైకు ఢీకొన్న ఘటనలో ఎస్ఐ శ్వేతతో పాటు మరొకరు మృత్యువాతపడ్డారు. కారు తొలుత బైకును ఢీకొట్టి, ఆ తర్వాత చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్ఐ శ్వేత ప్రాణాలు కోల్పోయారు.
 
ఆర్నకొండ నుంచి జగిత్యాల వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. శ్వేత కారును డ్రైవింగ్ చేస్తూ తొలుత బైక్‌ను, ఆ తర్వాత చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె ప్రమాదస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. శ్వేత మృతదేహాన్ని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. కాగా, జగిత్యాల పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె కోరుట్ల, వెల్గటూరు, కథలపూర్, పెగడపల్లిలలో ఎస్ఐగా విధులు నిర్వహించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు