వరంగల్ అర్భన్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ జిల్లాల్లోని టీడీపీ నేతలంతా బీజేపీలో చేరిపోయారు.
అటు టీఆర్ఎస్ పైనా ప్రత్యేక దృష్టిపెట్టారు కమలనాథులు. పదవులు దక్కక, ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిక్కెట్లు రాని అసంతృప్తితో ఉన్న నేతలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలే టార్గెట్ గా ముందుకెళ్తోంది బీజేపీ.
గతంలో పట్టున్న పరకాల, నర్సంపేట లో కాషాయం జెండా ఎగరేయాలని, మిగతా మహబూబాబాద్, జనగామ లాంటి ప్రాంతాల్లో సత్తా చాటాలని క్యాడర్ కు నిర్ధేశిస్తున్నట్లు సమాచారం. రేవూరితో నర్సంపేటపై పట్టుసాధించవచ్చని బీజేపీ నేతలు చెబుతున్నారు.