ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నాటి మెగాస్టార్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నంబర్ వన్ హీరో అని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఆయన అలా ఆషామాషీగా అని ఉండక పోవచ్చనేది చాలా మంది సినీ ప్రముఖుల మాటగా ఉంది. ఎందుకంటే.. టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. అంతేకాదు, ఆయన పంపిణీదారుడు కూడా! సినీ రంగానికి సంబంధించినంత వరకు తన అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా చెబుతారని ఆయనకు పేరుంది. బాక్సాఫీస్ వద్ద హీరోల స్టామినాను బట్టే నెంబర్ వన్ స్థానం డిసైడ్ అవుతుంది. కాబట్టి, దిల్ రాజు బాక్సాఫీస్ దగ్గర పవన్ సత్తా, స్టామినా ఏంటో తెలిసే ఈ కామెంట్ చేసి ఉంటారన్నది చాలా మంది అభిప్రాయంగా ఉంది.
ఈ ఆడియో వేదికపై ఆయన మాట్లాడుతూ హీరోగా 'ఖుషీ' నాటికే నంబర్ వన్ స్థానం దిశగా పవన్ అడుగులు వేశాడని, ఆ తర్వాత పదేళ్ల పాటు సరైన హిట్ లేకపోయినప్పటికీ, అదే స్టార్ ఇమేజ్ను పవన్ కంటిన్యూ చేశాడని, ఇది ఆయన స్టార్ స్టామినాకు నిదర్శనమని ఆయన అన్నాడు. ఆ తర్వాత రిలీజైన 'గబ్బర్ సింగ్' చరిత్ర సృష్టించిందని తెలిపాడు. ప్రస్తుతం, తెలుగు సినీరంగంలో పవన్ కల్యాణే నంబర్ వన్ హీరో అని ఆయన వ్యాఖ్యానించాడు.