భారత మహామహులైన నటీనటులతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మలయాళ దర్శకుడు శ్రీకుమారన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం మహాభారత కథతో సాగుతుంది.
ఈ చిత్ర కథ ప్రధానంగా భీముని పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఇందులో ధర్మరాజు పాత్రకు అక్కినేని నాగార్జునను సంప్రదిస్తున్నట్టు తాజా సమాచారం. ఇక భీముడిగా మలయాళ నటుడు మోహన్ లాల్, అర్జునుడిగా తమిళ హీరో విక్రమ్ నటిస్తుండగా, ద్రౌపది పాత్రకు ఐశ్వర్యారాయ్ని తీసుకుంటున్నారు.