సినీ నటుడు బాలకృష్ణ 101వ చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది. ఇందులో బాలయ్య రైతుగా నటించనున్నారు. కృష్ణవంశీ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రియను తీసుకోవాల్సిందిగా బాలయ్య సిఫారసు చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 'మనం' మూవీలో నాగార్జునతో కలిసి నటించిన శ్రియ.. అమాయక పల్లెటూరి పిల్లగా బాగా చేసిందన్న కాంప్లిమెంట్ కూడా పొందేసింది. మరి రైతు భార్యగా శ్రియ రెడీ అయినట్లేనా? కాగా, బాలయ్యతో శ్రియ చెన్నకేశవరెడ్డి చిత్రంలో జోడీగా నటించిన విషయం తెల్సిందే.