నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గౌతమీ పుత్రశాతకర్ణి. ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మే 9న మొరాకోలో ప్రారంభమైంది. ఆనాటి పరిపాలనా వ్యవహారానికి సంబంధించిన కథ కావడంతో ప్రేక్షకులను ఆ కాలానికి తీసుకువెళ్లడానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించడం కోసం భారీ సెట్లు .. భారీ ఖర్చు .. ఎక్కువ సమయం అవసరమవుతాయి.
ఈ సినిమా షూటింగ్ సందర్భంగా దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ ''మొరాకోలో మూడు వారాల పాటు చిత్రీకరణ జరుపుతాం. హాలీవుడ్ టెక్నిషియన్స్ సహకారంతో హాలీవుడ్ రేంజ్లో సినిమాను రూపొందిస్తున్నాము. సినిమా మొదటి రోజు పూర్తయ్యింది. నందమూరి నట సింహం, ప్రముఖ హాలీవుడ్ నటుడు కబీర్ బేడిగారు తదితరులు ఈ షెడ్యూల్లో పాల్గొన్నారు. తొలిరోజు సన్నివేశాలు అనుకున్న దానికంటే చాలా బాగా రావడంతో యూనిట్ మొత్తం చాలా హ్యపీగా ఉన్నాం'' అన్నారు.