'కబాలి' టిక్కెట్లు రెండు గంటల్లోనే అయిపోయాయట..!

సోమవారం, 18 జులై 2016 (10:38 IST)
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ''కబాలి'' చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఎయిర్‌ ఏషియా స్పెషల్‌ ప్యాకేజ్‌, కబాలి సిమ్, కబాలి వాల్ పేపర్స్, వెండి నాణెలు ఇలా అన్ని విధాలుగా ఈ చిత్రం దూసుకుపోతోంది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి కలైపులి ఎస్‌ థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ చిత్రానికి సంగీతం సమకూర్చారు. 
 
భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్, పాటలు ప్రేక్షకుల మన్ననలను పొందింది. ప్రపంచ వ్యాప్తంగా జులై 22వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. ఒక్క అమెరికాలోనే ఈ సినిమాను 400 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. 
 
అయితే అక్కడ ముందస్తు బుకింగ్‌లో ఈ చిత్రం టికెట్లు కేవలం రెండు గంటల్లోనే అమ్ముడుపోయాయని విశ్వస వర్గాలనీయ సమాచారం. దీంతో రజనీకాంత్‌ చిత్రానికి భారతదేశంలోనే కాదు అమెరికాలోనూ ఉన్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. మరి ఈ చిత్రం విడుదలైన తర్వాత ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి