హీరోయిన్ శృతి హాసన్కు సాధారణ చిత్రాల్లో నటించడం కంటే ఐటం సాంగ్లలో నటించేందుకే అమితాసక్తి చూపుతోంది. ఒక చిత్రం పూర్తి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుని నెలా రెండు నెలల పాటు డేట్స్ ఇచ్చి కథానాయికగా నటిస్తే వచ్చేదాని కన్నా ఎక్కువగా ఈ ఐటెం పాటలకు చెల్లించే డబ్బులే అధికంగా ఉండటంతో ఆమె ఇటువైపే మొగ్గు చూపుతోంది.
ఇటీవల మహేష్ బాబుతో 'ఆగడు'లో ఐటెం పాట చేసినందుకు 50 లక్షల రూపాయల వరకు శృతి హాసన్ అందుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇపుడు తాజాగా ఓ హిందీ చిత్రంలో ఐటం సాంగ్ చేసేందుకు రూ.75 లక్షల వరకు చార్జ్ చేస్తున్నట్టు సమాచారం. మహేష్ బాబు నటించిన 'ఒక్కడు' చిత్రాన్ని హిందీలో 'తేవర్' పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఓ ఐటెం పాటలో శృతిహాసన్ నర్తించనుంది. ఈ పాటలో గ్లామరస్గా నటిస్తున్నందుకు 75 లక్షలు చార్జ్ చేస్తోందని బాలీవుడ్ సమాచారం. ఈ చిత్రంలో అర్జున్ కపూర్తో కలిసి శృతిహాసన్ నటించనుంది.