జనసేనలోకి నమ్రత.. అంతా మహేశ్ బాబు వల్లే..?

శనివారం, 29 అక్టోబరు 2022 (15:52 IST)
తెలుగు సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మహేష్ బాబు మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ఇద్దరిలో ప్రస్తుతం పవన్ సినిమాలతో పాటు రాజకీయాల్లో ఉన్నారు. అటు మహేష్ బాబు సినిమాలతో పాటు వ్యాపార రంగంలో కూడా కొనసాగుతున్నారు. 
 
అయితే స్నేహితుడు పవన్ జనసేనకు మహేష్ బాహటంగా మద్దతు ప్రకటించారని ప్రచారం జోరుగా సాగుతోంది. పవన్‌కు మద్దతుగా మహేష్ ముందుగా వారి కుటుంబ సభ్యులను జనసేనలోకి పంపినట్లు తెలుస్తోంది. ఇంటర్నల్‌గా సపోర్టు చేసి స్నేహితుడి పార్టీ పవర్‌లోకి రావాలని మహేష్ బాబు కోరుకుంటున్నారుట.
 
ఇందులో భాగంగా.. మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ జనసేనలో చేరనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో కూడా కృష్ణ కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా ఉండేవారు. వీరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఆత్మీయ అనుబంధం ఉండేది. 
 
వైసీపీ ఆవిర్భావం తరువాత కృష్ణ కుటుంబం జగన్ వెంటే ఉండేది. ఇక కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. అయితే ప్రస్తుతం కుటుంబమంతా టీడీపీలోనే ఉంది. అయితే మహేష్ భార్య నమ్రతా మాత్రం జనసేన వైపు మొగ్గుచూపడానికి మహేషే కారణంగా తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు